AP Politics: జాతీయ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా బీహార్ రాజకీయాల్లో కీలక మలుపుగా, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని, అక్కడ బీజేపీ నేతకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించే దిశగా కసరత్తు జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాల అనంతరం కేంద్ర కేబినెట్లో మరిన్ని మార్పులు ఉండనున్నాయి.
Read Also: Manchu Manoj: సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు
ఏపీ కూటమికి అదనపు ప్రాధాన్యత
ఈ ప్రక్షాళనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు మరో మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో, ఈసారి జనసేన పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఎంపీల్లో ఒకరిని ఎంచుకుంటారా లేదా త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానం ద్వారా పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడిని కేంద్రానికి పంపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్ర మంత్రివర్గంలోనూ మార్పులు
మరోవైపు ఏపీ కేబినెట్లోనూ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి సీనియర్ నేత సోము వీర్రాజుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉండగా, జనసేన నుంచి నాగబాబుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న హామీపై చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తూ, త్వరలోనే ఈ నియామకాలపై అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: