AP Politics: ఆంధ్రప్రదేశ్ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇటీవల కలిశారు. రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన నేరుగా పార్టీ అధినేతతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also:Minister Narayana: ఏప్రిల్ 2027కి రాజధానిలోని ప్రధాన రహదారులు పూర్తి
ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ చర్యలు, పార్టీ వ్యూహాలపై కీలకంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రజా సమస్యలపై ఉద్యమాలను కొనసాగించాలని జగన్ అంబటి రాంబాబుకు సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో తప్పుడు కేసులు నమోదు చేస్తోందని జగన్ తీవ్రంగా విమర్శించినట్లు తెలిసింది. ఇలాంటి కేసులను చట్టపరంగా బలంగా ఎదుర్కోవాలని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. అలాగే కొందరు పోలీసు అధికారుల వ్యవహార శైలిపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని జగన్ పిలుపునిచ్చినట్లు సమాచారం. రానున్న రోజుల్లో వైసీపీ వ్యూహాత్మకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: