జనసేన పార్టీలో ఒక కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. పార్టీ(AP Politics) ఆవిర్భావం నుంచి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ తనకు అప్పగించిన అన్ని పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తనను బాధ్యతల నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన పార్టీ అధినేతకు లేఖ రాశారు.
Read Also:AP: స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి
పర్యావరణ అంశాలే నిర్ణయానికి కారణం
బొలిశెట్టి ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం నైతికత మరియు పర్యావరణ అంశాలే అని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కాలుష్య సమస్యలకు సంబంధించి హైకోర్టులో కొనసాగుతున్న ఒక పర్యావరణ కేసులో ఆయన పిటిషనర్గా ఉన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండగా, పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యావరణ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా, అదే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీలో కీలక పదవిలో కొనసాగడం సరికాదనే భావనతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో అమరావతి రాజధాని పర్యావరణ అంశాలపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కూడా బొలిశెట్టి నిర్ణయంపై ప్రభావం చూపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రాజీనామా కాదు, నైతిక విరామం
ఈ పరిణామంపై స్పందించిన బొలిశెట్టి సత్యనారాయణ,(AP Politics) ఇది పార్టీకి రాజీనామా కాదని స్పష్టం చేశారు. తాను కేవలం పార్టీ పదవుల నుంచి నైతిక విరామం తీసుకుంటున్నానని చెప్పారు. పర్యావరణ న్యాయం కోసం సాగుతున్న పోరాటం రాజకీయ కారణాలతో ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
కోర్టులో పెండింగ్లో ఉన్న అంశాలు పరిష్కారమయ్యాక, పార్టీ కోరుకుంటే మళ్లీ బాధ్యతలు చేపడతానని, జనసేన సిద్ధాంతాలు, విలువలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. జనసేనలో దీర్ఘకాలంగా కీలక పాత్ర పోషించిన బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ పదవుల నుంచి తప్పుకోవడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: