AP: అనంతపురం జిల్లాలో కొత్త బార్ల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-2028 లీజు కాలానికి గానూ ఓపెన్ కేటగిరీ కింద ఈ లైసెన్సులను మంజూరు చేయనున్నట్లు జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి బి. రామమోహన్ రెడ్డి వెల్లడించారు. నోటిఫికేషన్ ప్రకారం, జిల్లాలోని రెండు ప్రధాన పట్టణాల్లో ఈ బార్లకు అవకాశం కల్పించారు. తాడిపత్రి, రాయదుర్గం ఈ రెండు ప్రాంతాల్లో ఓపెన్ కేటగిరీలో బార్ల నిర్వహణ కోసం ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read also: Vijay-Pawan: పవన్ కళ్యాణ్ రూట్లోనే విజయ్? రెండు చోట్ల పోటీకి సిద్ధం!
దరఖాస్తు గడువు
బార్ లైసెన్సుల కోసం అర్హులైన వారు మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, మార్చి 4న లాటరీ ద్వారా లైసెన్సు దారుల ఎంపిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు. అదృష్టవంతులను ఎంపిక చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
దరఖాస్తుదారులు ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలను సమర్పించాలని జిల్లా ఎక్సైజ్ అధికారి రామమోహన్ రెడ్డి సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: