📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: అనంతపురంలో రెండు కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల

Author Icon By Saritha
Updated: February 24, 2026 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: అనంతపురం జిల్లాలో కొత్త బార్ల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-2028 లీజు కాలానికి గానూ ఓపెన్ కేటగిరీ కింద ఈ లైసెన్సులను మంజూరు చేయనున్నట్లు జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి బి. రామమోహన్ రెడ్డి వెల్లడించారు. నోటిఫికేషన్ ప్రకారం, జిల్లాలోని రెండు ప్రధాన పట్టణాల్లో ఈ బార్లకు అవకాశం కల్పించారు. తాడిపత్రి, రాయదుర్గం ఈ రెండు ప్రాంతాల్లో ఓపెన్ కేటగిరీలో బార్ల నిర్వహణ కోసం ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read also: Vijay-Pawan: పవన్ కళ్యాణ్ రూట్లోనే విజయ్? రెండు చోట్ల పోటీకి సిద్ధం!

AP: Notification issued for two new bars in Anantapur

దరఖాస్తు గడువు

బార్ లైసెన్సుల కోసం అర్హులైన వారు మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, మార్చి 4న లాటరీ ద్వారా లైసెన్సు దారుల ఎంపిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు. అదృష్టవంతులను ఎంపిక చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

దరఖాస్తుదారులు ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలను సమర్పించాలని జిల్లా ఎక్సైజ్ అధికారి రామమోహన్ రెడ్డి సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Anantapur Bar Notification Andhra Pradesh Liquor Policy Bar Lottery Process Rayadurgam Excise News Tadipatri Bar License

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.