📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: AP: నిందితులను కఠినంగా శిక్షించండి..మంత్రి అనిత

Author Icon By Saritha
Updated: December 1, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : గంజాయి(AP) మాఫియాకు ఎదురు నిలిచిన పెంచలయ్యను హత్య చేసిన హంత కులను, వారికి అండ దండలిచ్చి ప్రోత్సహించిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీని వాసరావు డిమాండ్ చేసారు. గంజాయిపై పోరాటంలో హత్య చేయ బడిన కుటుంబాన్ని పరామర్శించి వారికి అన్ని విధాలా పునరావాస చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీని వాసరావు హోం మంత్రి వంగలపూడి అనితకు(Vangalapudi Anitha) లేఖ రాశారు. “గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు మీరు పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. కానీ గంజాయి ముఠా చేసిన ఈ హత్యపై మీరు కనీసం స్పందించలేదు. మాట మాత్రంగా కూడా ఖండించ లేదు. గంజాయిపై పోరాడే వారికి మీరు ఎలా భరోసా ఇవ్వగలరు? ఇప్పటికైనా ఆ గంజాయి మాఫియాకు బలైన యువకుడి కుటుంబాన్ని మీరు సందర్శించి, ఆ కుటుంబానికి భరోసా కల్పించా లని కోరుతున్నాను. వారిది అత్యంత నిరుపేద దళిత కుటుంబం.

Read also: 2027 జూన్ 26 నుంచిగోదావరి పుష్కరాలు

Punish the accused severely.. Minister Anita

పెంచలయ్య కుటుంబానికి సహాయం, డ్రగ్స్ మాఫియా పై చర్యలు

పెంచలయ్య(AP) భార్యతో పాటు ఇద్దరు చదువుకుంటున్న పిల్లలున్నారు. ఆ కుటుంబానికి కనీసం రూ.50 లక్షల సహాయం, ఆరు ఎకరాల భూమి, ఒక ఇల్లు శాంక్షన్ చేయాలి. ఆయన భార్య దుర్గకి ఉద్యోగం కల్పించాలి. ఇద్దరి పిల్లల చదువుకి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ మేరకు మీ నుండి ప్రకటన వస్తుందని, ఇప్పటికైనా వెంటనే ఆ కుటుంబాన్ని సందర్శించి వారికి భరోసా కల్పిస్తారని ఆశిస్తున్నాను. డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు త్రికరణ శుద్ధితో తగిన చర్యలు చేపట్టాలి. డ్రగ్స్ మాఫియాపై పోరాడే ప్రజలకు బాసటగా మీ ప్రభుత్వం నిలబడాలని కోరుతున్నాను” అని శ్రీనివాసరావు ఆ లేఖలో పేర్కొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh politics CPM Dalit Family Support Drug Mafia Ganja Mafia Home Minister Anitha Latest News in Telugu Law and order Pencahlayya Murder V Srinivasa Rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.