ఆంధ్రప్రదేశ్(AP NewDistricts) రాష్ట్ర పరిపాలనా రూపురేఖలు మరోసారి మారుతున్నాయి. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సేవలు మరింత సమీపంగా అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియకు తుది రూపం దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించడంతో, ప్రభుత్వం మంగళవారం కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మార్కాపురం మరియు పోలవరం జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది.
Read Also: APSRTC: ఇకపై వాట్సాప్లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్.. విధానం ఇదే
రంపచోడవరం, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాల కార్యకలాపాలు
ప్రభుత్వ ఉత్తర్వుల(AP NewDistricts) ప్రకారం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా పరిపాలనా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. డిసెంబర్ 31 నుంచి ఈ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా, పలు నియోజకవర్గాలు, మండలాల పరిధుల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నందిగామ మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్కు మార్చారు. కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్ పరిధిలోకి తీసుకువచ్చారు. అలాగే పెనుగొండ ప్రాంతానికి ‘వాసవీ పెనుగొండ’గా కొత్త పేరు ఖరారు చేశారు. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ను కేంద్రంగా చేసుకుని కొత్త రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేశారు.
కొత్త ఏడాది నుంచి అమల్లోకి మార్పులు
కొత్త జిల్లాలు అమల్లోకి వస్తుండటంతో, సంబంధిత ప్రాంతాల్లో అధికారిక బోర్డులు, ప్రభుత్వ రికార్డులు, సరిహద్దు రాళ్లను నవీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త ఏడాది కానుకగా తీసుకొచ్చిన ఈ మార్పులతో పాలన మరింత సమర్థవంతంగా, ప్రజలకు చేరువగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రజలు తమ పరిధిలో జరిగిన మార్పులను గమనించి, అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: