📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

Author Icon By Saritha
Updated: February 4, 2026 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Nagababu made strong remarks, calling Jagan an enemy of Hinduism.

వైసీపీ పార్టీ హిందూ ద్రోహి అంటూ (AP) జనసేన ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ధ్వంసం ఘటన, అంతర్వేది రథం దగ్ధం ఘటన, తిరుమల డిక్లరేషన్ తదితర అంశాలపై ఆయన స్పందిస్తూ వైసీపీపై మండిపడ్డారు. తిరుమలలో వసతి గృహాల ధరలు పెంచి వేంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు దూరం చేశారని విమర్శించారు.

Read Also: HIV India: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నహెచ్ఐవి మరణాలు..

తిరుమల డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే అవమానకరంగా మాట్లాడారని నాగబాబు విమర్శించారు. పవన్ కల్యాణ్ భార్య, కూతురు తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారని, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారని అబ్దుల్ కలాం కంటే కూడా నీవు గొప్ప వ్యక్తివా? అని జగన్ పై మండిపడ్డారు. తిరుమల కొండతో పాటు ఇతర కొండలకు గుండు కొట్టాలని చూసింది నీవు కాదా? అని ప్రశ్నించారు.

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ పేరుతో (AP) వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నాగబాబు మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువుగా తాను గర్వపడుతున్నానని చెప్పారు. వైసీపీ నేతలకు ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఉన్న ఆసక్తి హిందూ దేవాలయాలపై లేదని విమర్శించారు. సినిమా రివ్యూలపై ఉన్న శ్రద్ధ భగవంతుడిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Hindu Sentiments Jana sena Latest News in Telugu nagababu Political Controversy Telugu News Tirumala Issue YCP Party

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.