📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

AP: విశాఖలో మరిన్ని కొత్త రైల్వే లైన్లు

Author Icon By Saritha
Updated: January 29, 2026 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో(AP) రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) స్వయంగా సమీక్షలు చేస్తున్నారు. అయితే వాల్తేరు డివిజన్‌లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంలకు విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్త లైన్లు లేకపోవడం వల్ల, వివిధ ప్రాంతాల నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు వచ్చే రైళ్లు ఆలస్యమవుతున్నాయి. 

ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో 8 ప్లాట్‌ఫాంలు మాత్రమే అదుబాటులో ఉన్నాయి. ఇవి పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలో రైల్వేబోర్డు అధికారులు స్టేషన్‌ను పరిశీలించి.. ప్లాట్‌ఫాంల సంఖ్యను 8 నుంచి 14కు పెంచాలని నిర్ణయించారు. రెండు అదనపు రైల్వే ట్రాక్‌లను కూడా నిర్మించనున్నారు. వాహనాల పార్కింగ్ ప్రాంతంలో 13, 14 నంబర్ ప్లాట్‌ఫాంల నిర్మాణానికి ఇప్పటికే మార్కింగ్ చేశారు. 

More new railway lines in Visakhapatnam

Read Also: Vizianagaram: హోంగార్డు ఆస్తి రూ.20 కోట్లు

కొత్త లైన్ల నిర్మాణంపై దృష్టి

(AP) కొన్ని ప్యాసింజర్ రైళ్లను పెందుర్తి, గోపాలపట్నం, సింహాచలం స్టేషన్లలో ఎక్కువసేపు నిలిపివేస్తున్నారు. సరుకు రవాణా రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా కొత్త లైన్ల నిర్మాణంపై దృష్టి సారించారు. విశాఖపట్నం రైల్వే మార్గంలో కీలకమైన అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. దువ్వాడ-ఉత్తర సింహాచలం మధ్య రూ.302.25 కోట్లతో 20.5 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ కొత్త లైన్ల నిర్మాణం వల్ల రైల్వే వ్యవస్థలో సామర్థ్యం పెరుగుతుంది.

విశాఖ-గోపాలపట్నం స్టేషన్ల మధ్య రూ.159.47 కోట్లతో 15.31 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని రైళ్లను స్టేషన్ బయటే ఆపాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త లైన్లు పూర్తయితే, ఒకేసారి ఎక్కువ రైళ్లను స్టేషన్లలోకి అనుమతించవచ్చు. దీనితో రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AndhraPradesh CMChandrababu Latest News in Telugu NewRailLines PlatformExpansion RailProjects RailwayStation Telugu News visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.