News Telugu: AP: ఇక సెలవు రోజుల్లోనూ బడుల్లో మధ్యాహ్న భోజనం

Read Time:  1 min
meal available even on holidays
meal available even on holidays
FONT SIZE
GET APP

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్లు శాతం ఫలితాలు సాధించేలా 100 రోజుల స్పెషల్ ప్రణాళికను అమలు చేస్తూ, ఈ వ్యవధిలో సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించడానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఆదివారాలు సహా ప్రతి రోజూ మెనూ ప్రకారం భోజనం వడ్డించాల్సి ఉంటుంది.

Read also: Award: గంటేడ గౌరునాయుడుకు తాపీ ధర్మారావు పురస్కారం

meal available even on holidays

meal available even on holidays

మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి

డిసెంబర్ 6 నుంచి schools-లో special study plan అమల్లోకి వచ్చింది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు స్టడీ క్లాసులు నిర్వహిస్తారు. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు రెండు సబ్జెక్టులపై ప్రత్యేక స్టడీలు ఉంటాయి. తరగతులు ముగిసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించి స్టూడెంట్లను ఇళ్లకు పంపుతారు.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కొన్ని పాఠశాలల్లో హాజరు శాతం దాదాపు 100% కు చేరింది. కొన్నిచోట్ల కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, హాజరు పెంచడానికి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. పాఠశాలలన్నీ ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి, నాణ్యత, పరిమాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని విద్యాశాఖ ఆదేశించింది

  • పదో తరగతి కోసం 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రారంభం
  • సెలవులు, ఆదివారాలు సహా ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం
  • ఉదయం, సాయంత్రం స్టడీ క్లాసులు; సెలవుల్లో 4 గంటల స్టడీ
  • తరగతుల తరువాత విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం
  • పాఠశాలల్లో హాజరు గణనీయంగా పెరుగుదల
  • మెనూ అమలు, విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.