ఏపీ(AP)లోని విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ AI డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ముందస్తు ఒప్పందాలు ఇప్పటికే కుదిరి ఉన్నాయి. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేపట్టడానికి గూగుల్తో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ నేరుగా టచ్లో ఉన్నారు.
విశాఖ డేటా సెంటర్ చర్చ
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai)తో పాటు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే (గ్లోబల్ నెట్వర్కింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్) తో సమావేశమై, ప్రాజెక్ట్ అమలుపై చర్చలు జరిపారు. మంత్రి లోకేష్, విశాఖలో $15 బిలియన్ డాలర్ల పెట్టుబడికి గూగుల్ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. డేటా సెంటర్ నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించేందుకు ప్రణాళికలను కూడా సమీక్షించారు.
Read Also: AP Government: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి
టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక
అంతేకాక, లోకేష్ గూగుల్ను విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పోరేషన్ ద్వారా డేటా సెంటర్ & సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు ప్రోత్సహించాలని కోరారు. అలాగే, ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్ట్లో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్, కేలిబ్రేషన్ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
సుందర్ పిచాయ్ సమావేశంలో, భారత్లో క్లౌడ్ రీజియన్స్ విస్తరణతో పాటు “Google for Startups Accelerator” ద్వారా స్టార్టప్లకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. విశాఖలో ఏర్పాటు కానున్న AI డేటా సెంటర్, అమెరికా వెలుపల గూగుల్ పెట్టుబడిలో అతిపెద్ద FDI అని పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్కాన్ ద్వారా గూగుల్ డ్రోన్ల (“వింగ్స్”) కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ జరుగుతోందని, ప్రతి నెలా 500 మిలియన్లకు పైగా వినియోగదారులు గూగుల్ ఉత్పత్తులను వాడుతున్నారని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: