చంద్రబాబు నాయుడికి వైఎస్ జగన్ ఒక లేఖ రాశారు. కృష్ణా నదీజలాల గురించి తెలంగాణ 763 టీఎంసీల డిమాండ్ చేయడంతో, ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం బలమైన వాదనలు ట్రిబ్యునల్ ముందు వినిపించాల్సిన సమయం ఇది అని ఆయన పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల్లో ఒక్క టీఎంసీ కోల్పోయినా దానికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని జగన్ తెలిపారు.
Read also: Corruption: అభివృద్ధికి తూట్లు పొడుస్తున్న అవినీతి
Letter from YS Jagan to Chandrababu Naidu
ఏపీ హక్కులు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని
జగన్ లేఖలో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. గతంలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు, కృష్ణా జలాల పంపిణీ విషయంలో టీడీపీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రాకుండా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
ట్రిబ్యునల్ విచారణ కీలక దశలో ఉన్నందున ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని జగన్ సూచించారు. తెలంగాణ 70% పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి వాటా పెంచాలని కోరుతుండగా, ప్రస్తుతం ఉన్న కేటాయింపులనే కొనసాగించాలని ఏపీ అభిప్రాయం. ఈ సందర్భంలో ఏపీ హక్కులు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :