📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

AP: ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు

Author Icon By Aanusha
Updated: December 30, 2025 • 9:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ (AP) ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి కీలక విధాన నిర్ణయం తీసుకుంది. ఇకపై పదోన్నతులకు మెరిట్ రేటింగ్ రిపోర్టులు (MRR)తో పాటు వార్షిక రహస్య నివేదిక (ACR)లను కూడా శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (DPC) పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఆర్టీసీ అధికారుల పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియలో మార్పులు వచ్చాయి.

Read Also: AP: ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ప్రభుత్వ శాఖల అధికారులకు వర్తించే నిబంధనలను ఇక్కడ కూడా అమలు

గతంలో కేవలం మెరిట్ రేటింగ్ రిపోర్టులు (MRR) ఆధారంగానే పదోన్నతులు కల్పించేవారు. అయితే, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కావడంతో, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు వర్తించే నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు మొదటి స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతులకు వర్తిస్తాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి గత ఐదేళ్లలో నాలుగేళ్ల మెరిట్ రేటింగ్ రిపోర్ట్, వార్షిక రహస్య నివేదికలను ఆధారంగా తీసుకుంటారు.

AP: Key changes in RTC employees’ promotions

2026-27 (ప్యానల్‌ ఇయర్)లో మూడేళ్ల ఎంఆర్‌ఆర్‌లు, రెండేళ్ల ఏసీఆర్‌లు చూస్తారు. 2027-28కి రెండేళ్ల ఎంఆర్‌ఆర్‌లు, మూడేళ్ల ఏసీఆర్‌లు పరిగణనలోకి వస్తాయి. 2028-29 (ప్యానల్‌ ఇయర్‌)కి ఒక ఏడాది ఎంఆర్‌ఆర్‌, నాలుగేళ్ల ఏసీఆర్‌లను పరిశీలిస్తారు. అయితే, 2029-30 ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రం, పదోన్నతుల కోసం గత ఐదేళ్ల ఏసీఆర్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్పులు ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. ఎంఆర్‌ఆర్‌ అంటే ఉద్యోగి పనితీరుపై చేసే సమీక్ష. ఏసీఆర్‌ అంటే ఉద్యోగి వార్షిక గోప్య నివేదిక.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Government APSRTC Departmental Promotion Committee latest news RTC employees promotions Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.