శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Kashibugga stampede) లో 9 మంది భక్తులు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఏకాదశి కావడంతో ఆలయానికి ఊహించని రీతిలో భక్తులు పోటెత్తడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
Read Also: AP: పంచాయతీరాజ్ శాఖలో1500 మందికి పైగా ప్రమోషన్
ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) పరిహారం ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కాశీబుగ్గ ఆలయాన్ని సందర్శించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గాయపడి పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున పరిహారం ప్రకటించారు.
ప్రధాని కార్యాలయానికి కూడా సమాచారం
మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.ఈ ఘటనపై ప్రధాని కార్యాలయానికి కూడా సమాచారం అందించామని, వారు కూడా స్పందించి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారని లోకేశ్ తెలిపారు.
మృతుల్లో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారని, పార్టీ ప్రమాద బీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు అదనంగా రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: