📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

AP: కేవలం 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్

Author Icon By Rajitha
Updated: December 18, 2025 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) చేపట్టిన ఉద్యమం కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్‌కు సమర్పించేందుకు ఆయన లోక్ భవన్‌కు వెళ్లనున్నారు. అయితే ఈ సమావేశానికి జగన్‌తో పాటు కేవలం 40 మంది వైసీపీ నేతలకు మాత్రమే అనుమతి ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Read also: CM Chandrababu: బిజినెస్ రిఫార్మర్ అవార్డుపై సీఎం ఏమన్నారంటే?

Jagan will meet the Governor with only 40 members

పరిమిత సంఖ్యలో నేతలే ఆయన వెంట

AP: తాడేపల్లి నివాసం నుంచి విజయవాడకు బయల్దేరిన జగన్, ముందుగా బందర్ రోడ్డులోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలినడకన లోక్ భవన్‌కు చేరుకుంటారు. పోలీసు నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో నేతలే ఆయన వెంట వెళ్లనుండగా, గవర్నర్‌తో భేటీ ముగిసిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

కోటి సంతకాల ఉద్యమం ప్రధాన లక్ష్యమని

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడమే కోటి సంతకాల ఉద్యమం ప్రధాన లక్ష్యమని వైసీపీ స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

governor Jagan Mohan Reddy latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.