📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: AP: తుఫాను ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్.. విధించిన ఆంక్షలు ఇవే!

Author Icon By Rajitha
Updated: November 4, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ (jagan mohan reddy) రెడ్డి పర్యటనకు పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. ‘మొంథా’ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించనున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. గతంలో జరిగిన అనుకోని ఘటనలను దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జగన్ పర్యటనకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ సమయంలో ఆయన గూడూరు మండలంలోని రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామాలను సందర్శించనున్నారు.

News Telugu: Breaking News – Vizag: నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న జగన్

AP: తుఫాను ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్..

AP: కాన్వాయ్‌లో గరిష్ఠంగా 10 వాహనాలు మాత్రమే ఉండాలనీ, మొత్తం 500 మందికి మించి ఎవరినీ అనుమతించరాదని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే రహదారులపై ర్యాలీలు, భారీ గుమికూడింపులు, సమావేశాలు లేదా డీజేల వినియోగం నిషేధించారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ నిబంధనలను అతిక్రమించినా లేదా అనుమతిని దుర్వినియోగం చేసినా పర్యటనను తక్షణమే రద్దు చేస్తామని హెచ్చరించారు. పర్యటన సమయంలో జరిగే ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టానికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలని పోలీసు అధికారులు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Jagan Mohan Reddy Krishna District latest news montha cyclone Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.