📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Latest News: AP: జగన్ లోకేష్ మధ్య మాటల యుద్ధం

Author Icon By Saritha
Updated: December 4, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP) రాజకీయాలలో ప్రస్తుతం విమాన ప్రయాణాల ఖర్చుల అంశం ప్రధాన చర్చగా మారింది. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర నిధుల నుండి 222 కోట్ల రూపాయలను విమాన–హెలికాప్టర్ ప్రయాణాలపై ఖర్చు చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు, ఈ ఆరోపణల నేపథ్యంలో జగన్ వర్సెస్ లోకేష్ వివాదం మరింత తీవ్రతరమైంది.

Read also: గురుకుల సంస్థలో 4 వేల ఉద్యోగాలు దరఖాస్తు

War of words between Jagan and Lokesh

లోకేష్‌ పై వైసీపీ ఆరోపణలు టీడీపీ రివర్స్ ఆరోపణలు

ఇటీవల మంత్రి నారా లోకేష్పై ఆరోపణలు చేస్తూ, ఆయన వారాంతాల్లో తరచుగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు చార్టర్డ్ విమానాలను వాడుకుంటూ ప్రభుత్వ నిధులను వృథా చేస్తున్నారని ప్రచారం చేసింది. అయితే దీనిపై టీడీపీ స్పష్టమైన ప్రతిస్పందన ఇచ్చింది. ఒక పౌరుడు ఆర్టీఐ ద్వారా లోకేష్ విమాన ప్రయాణ ఖర్చుల వివరాలు కోరగా, ప్రభుత్వ శాఖలు వెల్లడించిన సమాచారం ప్రకారం లోకేష్ ప్రయాణాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన బాధ్యత వహిస్తున్న ఐటీ, ఆర్టీజీఎస్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి శాఖల ద్వారా ఎలాంటి బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు. అంటే, లోకేష్ చేసిన 77 హైదరాబాద్ పర్యటనల ఖర్చులన్నీ ఆయన స్వంతంగా భరించారని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వైసీపీ చేసిన ఆరోపణలు అసత్యమని టీడీపీ మండిపడుతోంది.

టీడీపీ వెల్లడించిన నూతన గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రికార్డుల్లో మాజీ సీఎం జగన్ 2019–2024 మధ్య కాలంలో హెలికాప్టర్, విమాన ప్రయాణాల కోసం మొత్తం రూ.222.85 కోట్లు ప్రజా ధనాన్ని ఖర్చు చేశారని తెలిపారు. ఈ సంఖ్యలతో టీడీపీ, వైసీపీపై రాజకీయ దాడిని కొనసాగిస్తోంది. టీడీపీ ఆరోపణలకు స్పందించిన వైసీపీ, నారా లోకేష్‌పై విమర్శల జడివాన కురిపించింది. తండ్రి చంద్రబాబు లేకపోతే లోకేష్ మంత్రి కావడం కుదరేది కాదని, అంతేకాదు అబద్ధాలు చెప్పడంలో లోకేష్ నైపుణ్యం సాధించాడని వైసీపీ ఎద్దేవా చేసింది. అంతకుమించి, చంద్రబాబు భారత రాజకీయాల్లో “అబద్ధాల ఛాంపియన్” అని వ్యాఖ్యానిస్తూ, ప్రతీరోజూ కనీసం ఒక అబద్ధం సోషల్ మీడియాలో పెట్టకుండా బాబు, లోకేష్ నిద్రపోవడం కూడా కష్టమేనా? అంటూ వైసీపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh AP Government AP Politics Aviation Expenses Jagan Mohan Reddy Latest News in Telugu Nara Lokesh Political Controversy TDP YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.