📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP High Court: కారాగారంలో మూడేళ్లుగా నిర్బంధం.. తప్పుపట్టిన హైకోర్టు

Author Icon By Anusha
Updated: July 12, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : తమ ఆదేశాల మేరకు నడుచుకోలేదనే కారణంతో ఓ వ్యక్తిని గుంటూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ (డీసిడీఆర్సీ) జ్యుడీషియల్ రిమాండ్కు పంపి మూడేళ్ళుగా కారాగారంలో నిర్బంధించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇలా చేయడం రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ (Freedom) ను హరించడమేనంది. జైలు శిక్ష విధించే అధికారాన్ని డీసీడీఆర్సీ నిర్లక్ష్యంగా వినియోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ‘పెనాల్టీ పిటీషన్ల’ విచారణ సందర్భంగా తమ ముందు హాజరుకాలేదనే కారణంతో స్థిరాస్థి సంస్థ విజయసారథి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (వీఎస్మెచ్పీఎల్) ఎండీ అల్లాభక్షును జ్యుడీషియల్ రిమాండ్కు (Judicial remand) పంపారని, ఆయనను వెంటనే విడుదల చేయాలని గుంటూరు జిల్లా కారాగార సూపరింటెండెంట్ను ఆదేశించింది.

AP High Court: కారాగారంలో మూడేళ్లుగా నిర్బంధం.. తప్పుపట్టిన హైకోర్టు

అప్పగించకపోవడంతో

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందన రావు, జస్టిస్ జె. సుమతితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంకాయలపాడులో వీఎస్పాచ్పీఎల్ ఎండీ అల్లాభక్షు (MD Allahbhakshu) పలువురితో ప్లాట్ల విక్రయానికి ఒప్పందం చేసుకున్నారు. వాటిని అప్పగించకపోవడంతో కొనుగోలు దారులు 2019లో గుంటూరు డీసీడీఆర్సీని ఆశ్రయించారు. కొనుగోలుదారులకు నాలుగు వారాల్లో 12% వడ్డీతో సొమ్ము చెల్లించాలని అల్లాబక్షును కమీషన్ ఆదేశించింది. ఆయన అలా చేయలేదని కొనుగోలుదారులు 2022లో పెనాల్టీ పిటీషన్లు దాఖలు చేశారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు?

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఉంది. ఈ హైకోర్టులో గరిష్ఠంగా 37 మంది న్యాయమూర్తులు ఉండవచ్చు. వీరిలో 28 మంది స్థాయీ న్యాయమూర్తులుగా, 9 మంది అదనపు న్యాయమూర్తులుగా నియమించవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 29 మంది న్యాయమూర్తులు ఉన్నారు.

హైకోర్టు న్యాయమూర్తులకు అత్యధికంగా ఎంత జీతం ఉంటుంది?

భారతదేశంలో 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం, హైకోర్టుల ముఖ్య న్యాయమూర్తులకు నెల జీతంగా ₹2,50,000, ఇతర న్యాయమూర్తులకు ₹2,25,000 వరకు జీతం లభిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: AP Government: రెవెన్యూ మాన్యువల్ సిద్ధం చేసిన ప్రభుత్వం

Andhra Pradesh High Court Breaking News Consumer Rights DCDRC judgement Guntur news judicial remand illegal latest news personal liberty India Telugu News VSMHPL case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.