ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు న్యాయపరంగా భారీ ఊరట లభించింది.ఆయనపై కొనసాగిస్తున్న అన్ని విచారణలను అధికారికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటేశ్వరరావుపై గత ప్రభుత్వం ఐపీసీ సెక్షన్లు 120బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 409 (విశ్వాస భంగం)తో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. 2020లో ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్ (Intelligence Chief) గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సస్పెండ్ చేయడం, అవినీతి ఆరోపణలతో ఛార్జిషీట్లను దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.అయితే వెంకటేశ్వరరావు వేసిన క్రిమినల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి, ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్లు చట్టబద్ధంగా లేవని తేల్చి, కేసును కొట్టివేసింది. ఈ తీర్పుతో ఆయనకు న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది.
ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేసింది
ఐపీఎస్ అధికారిపై ఉన్న శాఖాపరమైన, క్రిమినల్ చర్యలను కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంది. డీజీపీ (DGP) కి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.ఏబీ వెంకటేశ్వరరావు తనపై దాఖలైన కేసులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడలోని స్పెషల్ జడ్జి ఫర్ ఎస్పిఈ మరియు ఏసీబీ కేసుల ముందు దాఖలైన ఎఫ్ఐఆర్, తదుపరి ఛార్జిషీట్లను రద్దు చేయాలని కోరుతూ ఆయన క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. వెంకటేశ్వరరావు వాదనలను విన్న హైకోర్టు, ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ, ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేసింది. ఈ తీర్పు వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) కేసులో ఒక కీలక మలుపుగా మారింది. హైకోర్టు తీర్పు తర్వాత, ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఇది వెంకటేశ్వరరావుకు మరింత ఊరటనిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉంది?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలోని జస్టిస్ సిటీ, నవరత్నాలలో భాగంగా గుంటూరు జిల్లాలో నెలపాడు వద్ద ఉంది.
ఏబీ వెంకటేశ్వరరావు ఏ బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్?
ఆయన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన 30 సంవత్సరాలకుపైగా పోలీసు సేవలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: CM Chandrababu: కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు