(AP) ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో వైద్యారోగ్యశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రుల ప్రాంగణాల్లో ఔషధ మొక్కల తోటలు, అంటే హెర్బల్ గార్డెన్స్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. రోగులు, వారి సహాయకులకు ఆహ్లాదాన్ని అందించేలా ఈ తోటల్లో పూల, ఔషధ మొక్కలను నాటనున్నారు. అలాగే, వాకింగ్ ట్రాక్, బెంచీలు, మంచినీటి సదుపాయం కల్పించేందుకు అనువైన స్థలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ చర్యల ద్వారా ఆసుపత్రుల వాతావరణాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Also: Nagababu: కులం అనేది పుట్టుకతో వచ్చే విషయం
హెర్బల్ గార్డెన్ అంటే ఏమిటి?
హెర్బల్ గార్డెన్ అనేది ఔషధ గుణాలు ఉన్న మొక్కలను ప్రత్యేకంగా నాటి పెంచే తోట. ఈ తోటల్లో సంప్రదాయ వైద్యానికి ఉపయోగపడే మొక్కలు ఉంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: