ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులకు ఇచ్చిన హామీని అతి తక్కువ సమయంలోనే నెరవేర్చారు. విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో ఇమామ్, మౌజన్ల బకాయిలు విడుదల చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం మొత్తం రూ.45 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించడం విశేషం. పండుగ పూట ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ముస్లిం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Read also: Andhra Pradesh Weather: ఏపీ ప్రజలకు చల్లని కబురు: నేడు పలు జిల్లాల్లో వర్షాలు

Ramzan 2026: Babu Government Releases ₹45 Crores as Ramzan Gift
ఖాతాల్లోకి ఆరు నెలల బకాయిలు
రాష్ట్రంలోని దాదాపు 5,000 మసీదుల్లో సేవలు అందిస్తున్న 10,000 మంది ఇమామ్లు మరియు మౌజన్లకు ఈ నిధులు నేరుగా అందుతాయి. గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న 2025 అక్టోబర్ నుండి 2026 మార్చి వరకు సంబంధించిన గౌరవ వేతనాలను ఒకేసారి చెల్లించనున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి నెల ఇమామ్లకు రూ.10,000 మరియు మౌజన్లకు రూ.5,000 చొప్పున వేతనం అందుతుంది. ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ఈ నగదును జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
ముస్లింల సంక్షేమానికి పెద్దపీట
కేవలం వేతనాల విడుదలే కాకుండా రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి అనేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అమరావతిలో కొత్తగా హజ్ హౌస్ నిర్మాణం చేపట్టడంతో పాటు, కడపలో ఆగిపోయిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వివాహ లైసెన్స్ల గడువును 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ఇప్పటికే 1,500 ఆస్తులను సర్వే చేయించి భద్రపరిచామని, మైనారిటీల రాజకీయ ఎదుగుదలకు కృషి చేస్తామని ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: