ఏపీ(AP Govt) కూటమి ప్రభుత్వం పౌర సరఫరా వ్యవస్థలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకులతో పాటు ప్రజల ఆరోగ్యం, మారుతున్న ఆహారపు అలవాట్లను కూడా దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తృణధాన్యాలను (రాగులు, జొన్నలు) ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. స్మార్ట్ కార్డుల పంపిణీ, మూసివేసిన రేషన్ దుకాణాల పునఃప్రారంభం తర్వాత ఇది రేషన్ వ్యవస్థలో తీసుకున్న ప్రధాన మార్పుగా భావిస్తున్నారు.
Read also: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు

ప్రస్తుతం రాయలసీమ జిల్లాలు — అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, శ్రీసత్యసాయి, అనమ్మయ్య, తిరుపతి, నంద్యాల ప్రాంతాల్లో ఇప్పటికే ఏప్రిల్ నుంచే బియ్యం, పంచదారతో పాటు రాగులు(Finger millet), జొన్నల పంపిణీ జరుగుతోంది. ఈ డిసెంబరు నుంచి ఈ పథకం ఉత్తరాంధ్ర జిల్లాలకు — విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం వరకు విస్తరించింది.
రేషన్లో బియ్యం–తృణధాన్యాల కొత్త కాంబినేషన్
ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ఇప్పటికే 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తోంది. ఇప్పుడు కొత్త విధానంలో బియ్యంతో పాటు గరిష్ఠంగా 3 కేజీల వరకు రాగులు లేదా జొన్నలు తీసుకునే ఆప్షన్ను రేషన్ కార్డుదారులకు కల్పించింది. ఉదాహరణకు – ఒక కుటుంబం నెలకు 20 కేజీల బియ్యం తీసుకుంటే, వారికి 2 కేజీల రాగులు కావాలనుకుంటే: 18 కేజీల బియ్యం + 2 కేజీల రాగులు అందిస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన రాగి పిండుల పంపిణీ పథకాన్ని ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం శక్తివంతంగా తిరిగి ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా టెండర్ల ద్వారా రాగులు, జొన్నలను కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా అందిస్తోంది. రాగులు, జొన్నల పట్ల ప్రజల ఆసక్తి పెరగడంతో, త్వరలోనే అన్ని జిల్లాల్లో ఈ పంపిణీని పూర్తి స్థాయి లో అమలు చేసేందుకు పౌర సరఫరాల సంస్ధ సిద్ధమవుతోంది.
ఆరోగ్యకరమైన ఆహారం వైపు రాష్ట్రం
AP Govt: తృణధాన్యాలు రక్తపోటు, డయాబెటిస్, బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు పోషక విలువలు గల ఆహారాన్ని తక్కువ ఖర్చుతో చేరవేయడంలో పెద్ద ముందడుగుగా నిలుస్తుంది. సాంప్రదాయ ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తూ, ఆరోగ్యాన్ని మెరుగుపరచే దిశగా ఈ కొత్త రేషన్ విధానం అమలవుతోంది.
ఏపీ రేషన్లో రాగులు, జొన్నలు ఎవరికి అందుతాయి?
అన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా అందుతాయి.
ఒక కుటుంబం ఎంత మేరకు తృణధాన్యాలు తీసుకోగలదు?
గరిష్ఠంగా 3 కేజీల వరకు, బదులుగా బియ్యం క్వాంటిటీలో తగ్గింపు ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: