ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు కొంత ఉపశమనం లభించింది. గత కొంతకాలంగా బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్పత్రులు సేవలను నిలిపివేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రూ.250 కోట్ల బకాయిలను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ల మధ్య జరిగిన భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన రూ.250 కోట్లు కూడా త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి పయ్యావుల స్పష్టంచేశారు.
Latest News: Indiramma: ఇండిరమ్మ ఇల్లు కొత్త నిబంధనలు
ప్రభుత్వం నుంచి నిధుల విడుదలతో ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులపై ఉన్న ఒత్తిడి కొంత తగ్గనుంది. సమ్మె కారణంగా పేద రోగులు చికిత్సకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచిత వైద్య సేవలు అందించే ఈ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు, అత్యవసర సేవలు స్తంభించిపోయాయి. దీంతో వైద్య సేవల్లో అంతరాయం కలగడం ప్రభుత్వ ప్రతిష్టకూ భంగం కలిగించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరితగతిన నిధులు విడుదల చేస్తూ రోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.

మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ ప్రాధాన్యత. అందుకే మొదట దశలో రూ.250 కోట్లను విడుదల చేశాం. మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే ఇస్తాం” అని తెలిపారు. అలాగే, ఆస్పత్రులు వెంటనే సమ్మె విరమించి సాధారణ సేవలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయంతో ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులు తిరిగి పనిచేయడం ప్రారంభిస్తే, వేలాది రోగులకు ఉపశమనం లభించనుంది. ప్రభుత్వం ఆరోగ్య రంగంలో ఆర్థిక స్థిరత్వం తీసుకురావడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/