AP Government: మహిళలకు గుడ్ న్యూస్: ఏపీలో స్మార్ట్ కిచెన్ పథకం

Read Time:  1 min
AP Government
AP Government
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం మరో కీలక పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకంను మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ఈ పథకం ద్వారా, మహిళలు వంట, ప్యాకింగ్, భోజనం పంపిణీ మరియు వ్యర్థాల నిర్వహణ వంటి విభాగాల్లో ప్రధాన బాధ్యతలు చేపడతారు. ఇప్పటికే కడప, (kadapa) జమ్మలమడుగు జిల్లాలలో ఈ పథకం సక్సెస్ అయ్యింది. విజయవంతమైన విధంగా అమలవుతున్నందున, త్వరలో 33 కొత్త స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు.

Read also: YS Jagan: జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల్లో కేసీఆర్-కేటీఆర్

AP Government

AP Government

మహిళలకు ఆర్ధిక స్వావలంబన

పథకం కింద మహిళలు నేచురల్/ఆర్గానిక్ కూరగాయలు పండించి, వాటిని మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తారు. దీని ద్వారా వారికి నిరంతర ఆదాయం లభిస్తుంది.
ఆర్గానిక్ వ్యవసాయం పై ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. మండల సమాఖ్యలు ఈ కార్యక్రమంలో సహాయం చేస్తాయి. అదనంగా, ఆర్గానిక్ కూరగాయలను భోజనంలో ఉపయోగించడం వల్ల, పిల్లలకు పోషక విలువలు పెరుగుతాయి. పథకం అమలు ద్వారా మహిళలు ఉద్యోగ అవకాశాలు పొందుతారు, ఆర్ధికంగా బలోపేతం అవుతారు మరియు రాష్ట్రంలో ఆహార ప్రమాణాలు మెరుగుపడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.