AP: సహాయ, పునరావాస ప్యాకేజీ కోసం రూ.1,100 కోట్లు విడుదల విజయవాడ : పోలవరం (polavaram) ప్రాజెక్టు నిర్వాసితుల సహాయ, పున రావాస ప్యాకేజీ కోసం రూ.1,100 కోట్లు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో అడ్వాన్సుగా ఇచ్చిన నిధులలో మిగిలి ఉన్న రూ.1,800 కోట్ల నుంచి ఈ మొత్తాన్ని ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు రాష్ట్ర ఆర్థిక శాఖ మళ్లించింది. ఈ నిధులు ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పరిహారం చెల్లించడానికి దాదాపుగా సరిపోతాయని జల వనరుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో రూ.100 కోట్లు అందితే ఈ దశ చెల్లింపులు సంపూర్ణంగా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
AP: రాష్ట్రానికి కేంద్రం మరో నజరానా…
Ap
కేంద్రం ఒత్తిడితోనే కదలిక
నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ నిర్వాసితులకు చెల్లింపులు జరపడంలో జాప్యంపై కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా ఒత్తిడి తెస్తోంది. ఈ నెల ఆరంభంలో ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరిగింది. బడ్జెట్లో కేటాయించిన నిధులను నిర్ణీత సమయంలో ఖర్చు చేయకపోతే అవి మురిగిపోయే ప్రమాదం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో, చెల్లింపుల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మంత్రి పాటిల్ రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ సమాచారాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్య సాయిప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు (chandrababu) తీసుకెళ్లడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించిం దీని ఫలితంగానే రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళవారం రూ.1,100 కోట్లను విడుదల చేసింది. గత ఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాడా రూ.1,000 కోట్లను నిర్వాసితుల ఖాతాల్లో చేసింది. ఈసారి కూడా లబ్దిదారుల ఖాతాల్లో నేర డబ్బు జమ చేసి, వారితో కలిసి నిర్వహించాలని మంత్రి నిమ్మల రామానాయ భావిస్తున్నట్లు సమాచారం.
పోలవరం నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఎంత నిధులు విడుదల చేసింది?
రూ.1,100 కోట్లు విడుదల చేసింది.
ఈ నిధులను ఏ కోసం ఉపయోగించనున్నారు?
నిర్వాసితుల సహాయ, పునరావాస ప్యాకేజీ చెల్లింపుల కోసం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: