📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

AP: దివ్యాంగులకు శుభవార్త: ఉచితంగా మూడు చక్రాల మోటార్ వాహనాలు

Author Icon By Pooja
Updated: December 24, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ‘సూపర్ సిక్స్’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అనేక వాగ్దానాలను నెరవేర్చింది. తాజాగా మరో కీలక నిర్ణయంతో దివ్యాంగులకు తీపికబురు అందించింది.

Read Also: R. Krishnaiah: విజయవాడలో జరగనున్న బిసి ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయాలి

Andhra Pradesh: Good news for persons with disabilities: Free three-wheeled motor vehicles.

ప్రస్తుతం దివ్యాంగులకు(AP) నెలకు రూ.6 వేల పింఛన్ అందిస్తున్న ప్రభుత్వం, వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా కొత్త పథకాన్ని ప్రకటించింది. దివ్యాంగులు స్వతంత్రంగా ప్రయాణించేందుకు వీలుగా ఉచితంగా మూడు చక్రాల రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు అందించనుంది.

తొలి దశలో నియోజకవర్గానికి 10 వాహనాలు

దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో తొలి దశలో 10 మంది దివ్యాంగులకు ఈ వాహనాలు అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.17.50 కోట్ల నిధులు కేటాయించింది. మొత్తం 1750 మంది దివ్యాంగులకు మొదటి విడతలో ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఈ వాహనాల ద్వారా వారు ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాల కోసం సులువుగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. విశాఖపట్నంలో రూ.200 కోట్ల వ్యయంతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో దివ్యాంగులకు వివిధ క్రీడల్లో శిక్షణ అందించనున్నారు. అలాగే ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా 21 సెంచరీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సహకారంతో ఉచిత స్కిల్ ట్రైనింగ్ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ట్రాన్స్‌జెండర్లకు కూడా రేషన్ కార్డులు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఉచిత వాహనాల అర్హతలు ఇవే

దివ్యాంగులకు అందించే ఒక్కో మూడు చక్రాల వాహనం ధర సుమారు రూ.1 లక్ష. ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరి.

ఈ పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ప్రతి సంవత్సరం దివ్యాంగులకు వాహనాలు అందిస్తామని మంత్రి వీరాంజనేయస్వామి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Disabled Welfare Scheme Free Three Wheeler Scheme Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.