AP: బీసీలకు శుభవార్త.. సూర్య ఘర్ పథకంలో అదనపు ఆర్థిక సహాయం

Read Time:  1 min
AP
AP
FONT SIZE
GET APP

ఏపీ(AP) ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేస్తోంది. ఈ పథకం ద్వారా వెనుకబడిన వర్గాలు, పేద కుటుంబాలు సొంత ఇళ్లపై సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అదనపు ప్రోత్సాహం అందిస్తోంది. కేంద్రం ఇచ్చే రాయితీకి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఆర్థిక సహాయం ప్రకటించడం వల్ల లబ్ధిదారులకు డబుల్ బెనిఫిట్ కలగనుంది.

Read Also: AP: ఇవాళ అనకాపల్లికి సీఎం చంద్రబాబు

ప్రత్యేకంగా బీసీ వర్గాలకు రెండు కిలోవాట్ల సోలార్ యూనిట్ ఏర్పాటు కోసం కేంద్ర(AP) సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 వేల అదనపు రాయితీ ఇస్తోంది. దీంతో మొత్తం రూ.80 వేల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇక ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రెండు కిలోవాట్ల సోలార్ యూనిట్లు పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్లపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల వరకు సబ్సిడీ ఇస్తుండగా, మిగిలిన వ్యయానికి బ్యాంకు రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

AP
AP

ఈ పథకం వల్ల బీసీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గుతుందని, వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా పునరుత్పాదక ఇంధన వినియోగం పెరిగి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకొని సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.