ప్రముఖ విప్లవ గాయకుడు, కవి గద్దర్ కుమార్తె వెన్నెల ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును (CM Chandrababu) కలిశారు. ఈ సందర్భంగా ఆమె సీఎంకు వినతిపత్రం సమర్పిస్తూ, ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ కల్చరల్ విభాగానికి గద్దర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: AP: స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు

ఈ సందర్భంగా వెన్నెల, తెలుగు సాంస్కృతిక రంగానికి, ప్రజా ఉద్యమాలకు గద్దర్ చేసిన విశేష సేవలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విజ్ఞప్తులపై (AP) సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, గద్దర్ సేవలను గౌరవించేలా సానుకూల నిర్ణయం వెలువడుతుందన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: