ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి పీవీజీడీ ప్రసాదరెడ్డికి కోర్టు నెల రోజుల సాధారణ జైలుశిక్ష విధించింది. అదేవిధంగా రూ.2 వేల జరిమానా కూడా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయస్థానం ప్రసాదరెడ్డి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, నిర్లక్ష్యం చూపించారని, మొండి వైఖరి ప్రదర్శించారని తీవ్రంగా పేర్కొంది.
Read also: Nara Lokesh: టీమిండియా విజయం .. స్పందించిన మంత్రి లోకేశ్

VC Prasad Reddy sentenced to prison
అప్పీల్ దాఖలు చేసుకునే అవకాశం
ఈ కేసు నేపథ్యానికి వస్తే… ఏయూ బోటనీ విభాగంలో 17 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న నూకన్నదొర 2022లో తన ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. నేరుగా కోర్టును ఆశ్రయించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాదించాడు. 2023 మార్చిలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, కానీ ఆప్పుడు వీసీగా ఉన్న ప్రసాదరెడ్డి ఆ ఆదేశాలను అమలు చేయలేదు. ఆ తరువాత నూకన్నదొర కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రసాదరెడ్డి ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను విస్మరించారని నిర్ధారించారు. అప్పీల్ దాఖలు చేసుకునే అవకాశం కోసం తీర్పు అమలును ఆరు వారాలు సస్పెండ్ చేశారు. అప్పీల్లో స్టే రాకపోతే, డిసెంబర్ 22 సాయంత్రం 5 గంటలలోపు హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోవాల్సిందని ఆదేశాలు వచ్చాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: