(AP) విశాఖపట్నం నుంచి ఎర్నాకుళం వెళ్తున్న టాటా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ (18189) గత అర్ధరాత్రి అగ్నిప్రమాదానికి గురైంది.. రైల్లోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న B1 కోచ్లో ముందుగా మంటలు చెలరేగాయి.. ఆ తర్వాత M2కి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే.. B1, M2 కోచ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఏపీ (AP) హోం మంత్రి అనిత,
Read Also: SCR: సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

మంత్రి విచారం
అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: