AP: రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం: సాకే వినయ్

Read Time:  1 min
AP: రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం: సాకే వినయ్
FONT SIZE
GET APP

బహుజన సమాజ్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ సాకే వినయ్ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు(AP) తెలియజేశారు. రైతు(Farmer) సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాను కూడా వ్యవసాయ నేపథ్యంతో వచ్చిన వ్యక్తినని, రైతులు ఎదుర్కొనే సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు తనకు ప్రత్యక్ష అనుభవమేనని అన్నారు. రైతు పండించే ప్రతి పంటకు తగిన గిట్టుబాటు ధర రావాల్సిందేనని, అప్పుడే రైతు ఆత్మగౌరవంతో జీవించగలడని అభిప్రాయపడ్డారు. బీఎస్పీ పార్టీ ఎల్లప్పుడూ అన్నదాతల పక్షాన నిలబడుతుందని, రైతుల హక్కుల కోసం అవసరమైన ప్రతి పోరాటానికి సిద్ధంగా ఉంటుందని సాకే వినయ్ తెలిపారు. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న సత్యాన్ని పాలకులు గుర్తించాలన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని సూచించారు.

Read Also: AP Govt: సైనికులకు గాలంట్రీ అవార్డుల నగదు సహాయం పెంపు

AP: రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం: సాకే వినయ్
Farmer welfare is the main objective: Sake Vinay

గిట్టుబాటు ధర, సబ్సిడీలపై ప్రభుత్వ వైఫల్యం

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సంక్షేమం పేరుతో పథకాలు ప్రకటిస్తున్నప్పటికీ, అవి క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావడం లేదన్నారు. (AP) గడిచిన 20 నెలలుగా పంటలకు కనీస మద్దతు ధర సక్రమంగా అందకపోవడం, సబ్సిడీలు ఆలస్యం కావడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేవలం పేరుకే పథకాలు కాకుండా, వాస్తవంగా రైతులకు ఉపయోగపడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, గిట్టుబాటు ధర, సాగునీటి సౌకర్యాలు, ఇన్పుట్ సబ్సిడీలు వంటి అంశాలపై స్పష్టమైన విధానం రూపొందించాలని కోరారు. రైతు సంక్షేమం మాటల్లో కాకుండా కార్యాచరణలో కనిపించాలన్నదే బీఎస్పీ ఆకాంక్ష అని సాకే వినయ్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.