Telugu news: AP Education: ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్య

Read Time:  1 min
AP Education
AP Education
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ(AP Education) ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టింది. విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజుల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్న కేసులపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పదో తరగతి పరీక్షల ఫీజుల విషయంలో పాఠశాలలు రూల్‌లను మించిపోయి రూ.900 వరకు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు(complaints) లభించాయి, ఆవును ప్రభుత్వానికి అందడంతో విద్యాశాఖ తక్షణమే చర్యలకు సిద్ధమైంది.

Read Also: Scrub typhus: విస్తరిస్తున్న స్క్రబ్‌ టైఫస్ బెల్స్‌తో టెన్షన్‌

AP Education
Action against high fees of private schools

ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఒక విద్యార్థి అన్ని సబ్జెక్టులకు కలిపి చెల్లించవలసిన ఫీజు రూ.125 మాత్రమే, కానీ ప్రైవేట్ పాఠశాలలు(AP Education) ఈ మొత్తానికి అనేక రెట్లు పెంచి వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. విద్యాశాఖ అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలకు హెచ్చరికలు జారీ చేసింది, ఈ విధమైన కార్యకలాపాలపై చర్యలు తీసుకుని, జరిమానాలు విధించనున్నట్లు స్పష్టం చేసింది.

విద్యార్థులు, తల్లిదండ్రులు ఫీజు నేరుగా చెల్లించగలరు

అదేవిధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అదనపు వసూళ్లు ఉంటే, ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని డైరెక్టర్ హెచ్చరించారు. ఫిర్యాదులు ఎంఈవోలు(MEO), డిప్యూటీ డీఈవో, డీఈవో(DEO), ఆర్జేడీలకు అందజేయాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా మాత్రమే పరీక్ష ఫీజులు చెల్లించేవిధానం ఉండగా, ఈ ఏడాది నుంచి విద్యార్థులు నేరుగా ‘Board of Secondary Education’ వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించారు. ఈ మార్పు విద్యార్థుల ఇష్టానుసారంగా, ఫీజు అధిక వసూళ్లను నివారించడానికి తీసుకురాబడింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.