📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

AP: విశాఖపట్నంవాసులకు తాగునీటి కష్టాలకు చెక్‌

Author Icon By Rajitha
Updated: January 23, 2026 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని మధురవాడ జోన్‌లో ఉన్న 5, 6 వార్డుల ప్రజలకు ఎప్పటినుంచో తాగునీటి సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితికి త్వరలోనే ముగింపు పలకనున్నారు. సాయిరాంకాలనీ కొండపై నిర్మిస్తున్న కొత్త రిజర్వాయర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు నిరంతర తాగునీరు అందుబాటులోకి రానుంది.

Read also: AP: రీసైక్లింగ్ పరిశ్రమలకు 40 శాతం రాయితీ

Drinking water problems for Visakhapatnam residents come to an end

రూ.3.5 కోట్లతో శరవేగంగా సాగుతున్న రిజర్వాయర్ పనులు

అమృత్ 2.0 పథకం కింద గతంలో ప్రారంభమైన ఈ రిజర్వాయర్ పనులు నిధుల లేమితో కొంతకాలం నిలిచిపోయాయి. తాజాగా కూటమి ప్రభుత్వం స్పందించి అవసరమైన నిధులను మంజూరు చేయడంతో పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. మొత్తం రూ.3.5 కోట్ల వ్యయంతో సాయిరాంకాలనీ కొండపై నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్‌ను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

31 వేల మందికి వేసవిలోనూ నిరంతర తాగునీరు

ఈ రిజర్వాయర్ పూర్తయితే సుమారు 31 వేల మంది ప్రజలకు తాగునీటి కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని అధికారులు చెబుతున్నారు. సాయిరాంకాలనీ ఫేజ్-1, 2, 3, శ్రీనివాస్‌నగర్, డ్రైవర్స్‌కాలనీ, వైభవ్‌నగర్, ప్రశాంతినగర్, కొమ్మాది గ్రామం, హౌసింగ్‌బోర్డుకాలనీ, అమరావతికాలనీ, సేవానగర్, దేవిమెట్ట, రిక్షాకాలనీ వంటి అనేక ప్రాంతాలకు నీటి సరఫరా మెరుగుపడనుంది.

డ్రమ్ములు, మోటార్ల బాధకు ఇక గుడ్‌బై

ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లోని ప్రజలు వేల రూపాయలు ఖర్చుచేసి డ్రమ్ముల్లో నీటిని తెప్పించుకోవాల్సి వచ్చేది. మోటార్ల సాయంతో నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి ఉండేది. కొత్త రిజర్వాయర్ అందుబాటులోకి వస్తే ఈ కష్టాలన్నీ గతమవుతాయి. ఎండాకాలంలో కూడా ఎలాంటి నీటి ఇబ్బందులు ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి తప్పనిసరిగా నీటి సరఫరా ప్రారంభిస్తామని హామీ ఇస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Drinking Water GVMC latest news Madhurawada Telugu News visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.