📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

AP Crime: ఆత్మహత్యకు పాల్పడ్డ గ్రామ సచివాలయ ఉద్యోగి

Author Icon By Anusha
Updated: January 29, 2026 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని (AP Crime) కర్నూలు జిల్లా నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయంలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మధుశేఖర్ కార్యాలయ బాత్రూంలో ఆత్మహత్యకు యత్నించాడు. తోటి ఉద్యోగులు గమనించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Read Also: ACB Raids: ఏపీలో పలుచోట్ల ACB సోదాలు

ఆత్మహత్యయత్నం పాల్పడటం పై పలు అనుమానాలు

బాదితుడి బంధవులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన మల్లమ్మ, చిన్న బాలయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు,పెద్ద కుమారుడైన మధు శేఖర్ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. గోస్పాడు మండలం నెహ్రూ నగర్ లో ఆరు సంవత్సరాలు విధులు నిర్వహించిన మదుశేఖర్ గత సంవత్సరం జరిగిన బదిలీలలో బిల్లలాపురంలో విధులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం సచివాలయం పైన ఉన్న బాత్ రూమ్‌కని వెళ్లిన మధుశేఖర్ ఎంత సేపటికి రాకపోవడం అనుమానం వచ్చిన తోటి ఉద్యోగులు పైకి వెళ్ళి చూశారు.

AP Crime: Village Secretariat employee commits suicide

అక్కడ అపస్మారక స్థితిలో రక్తపు మడుగులో పడిపోయి ఉన్న మధును చూసి షాక్ అయ్యారు. వెంటనే అంబులెన్స్ సహాయంతో మధుశేఖర్ ను నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కత్తితో చెయ్యి, గొంతు కోసుకొని అత్మహత్యయత్నం పాల్పడటంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కొరకు కర్నూలు తరలించారు.ఉద్యోగి మధుశేఖర్ కత్తితో గొంతు, చెయ్యి కోసుకొని ఆత్మహత్యయత్నం పాల్పడటం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్యయత్నంకు ప్రేమ వ్యవహారమా,అర్థిక ఇబ్బందులా, మరే ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP News Billalapuram Village Secretariat Kurnool District latest news Nandyal Mandal Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.