📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

Telugu News: AP Crime: ఎసిబికి పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్దార్

Author Icon By Sushmitha
Updated: November 12, 2025 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నంద్యాల జిల్లా (డోన్): (AP Crime) నంద్యాల జిల్లాలోని డోన్ తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రీసర్వే డిప్యూటీ తహశీల్దార్(Tahsildar Sunil) సునీల్ రాజు ₹35 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు.

Read Also: Jublieehills bypoll:ఎన్నిక తర్వాత పార్టీల్లో ఉత్కంఠ – “గెలుస్తామా.. మెజార్టీ ఎంత?”

AP Crime

చుక్కల భూమిని పట్టాభూమిగా మార్చడానికి డిమాండ్

ఏసీబీ(ACB) డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ప్రకారం, వెల్దుర్తి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన రైతు దామ వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు ఈ దాడి జరిగింది. డోన్ మండలం జగదుర్తి గ్రామంలో రైతుకు(farmer) ఉన్న సర్వే నెంబర్లకు చెందిన చుక్కల భూమిని (డాటెడ్ ల్యాండ్) పట్టాభూమిగా మార్చడానికి రీసర్వే డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు ₹35 వేలు లంచం డిమాండ్ చేశాడు.

ఏసీబీ ట్రాప్, తదుపరి చర్యలు

రైతు వేణుగోపాల్ ముందస్తుగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, వారు తమ సిబ్బందితో కలిసి డోన్ తహశీల్దార్ కార్యాలయంపై మెరుపు దాడి చేశారు. డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు రైతు నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. లంచం డబ్బులను సాక్ష్యాలతో సహా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, తదుపరి విచారణను కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

ACB Raid Corruption Google News in Telugu Latest News in Telugu Nandyal Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.