నంద్యాల జిల్లా (డోన్): (AP Crime) నంద్యాల జిల్లాలోని డోన్ తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రీసర్వే డిప్యూటీ తహశీల్దార్(Tahsildar Sunil) సునీల్ రాజు ₹35 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు.
Read Also: Jublieehills bypoll:ఎన్నిక తర్వాత పార్టీల్లో ఉత్కంఠ – “గెలుస్తామా.. మెజార్టీ ఎంత?”
చుక్కల భూమిని పట్టాభూమిగా మార్చడానికి డిమాండ్
ఏసీబీ(ACB) డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ప్రకారం, వెల్దుర్తి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన రైతు దామ వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు ఈ దాడి జరిగింది. డోన్ మండలం జగదుర్తి గ్రామంలో రైతుకు(farmer) ఉన్న సర్వే నెంబర్లకు చెందిన చుక్కల భూమిని (డాటెడ్ ల్యాండ్) పట్టాభూమిగా మార్చడానికి రీసర్వే డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు ₹35 వేలు లంచం డిమాండ్ చేశాడు.
ఏసీబీ ట్రాప్, తదుపరి చర్యలు
రైతు వేణుగోపాల్ ముందస్తుగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, వారు తమ సిబ్బందితో కలిసి డోన్ తహశీల్దార్ కార్యాలయంపై మెరుపు దాడి చేశారు. డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు రైతు నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. లంచం డబ్బులను సాక్ష్యాలతో సహా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, తదుపరి విచారణను కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: