గర్భవతినంటూ డబ్బుకోసం బ్లాక్ మెయిల్(Blackmail) ప్రేమ.. పెళ్లి ఈ రెండు ప్రతివ్యక్తి జీవితంలో ముఖ్యమే. కోటీశ్వరుడికైనా.. పేదవాడికైనా స్పందించే మనసు ఒకేలా ఉంటుంది. ఓ తోడు కోసం పరితపిస్తుంది. జీవనయానంతో తన తోడుకోసం ప్రతి అమ్మాయి, అబ్బాయి అన్వేషిస్తారు. స్వచ్ఛమైన, నిజమైన ప్రేమలు నేటికాలంలో కొరవడుతున్నది. స్వార్థం, సంకుచితం, ధనాపేక్ష ఇవన్నీ ప్రేమను చంపేస్తున్నాయి. అందుకే ప్రేమ పేరుతో ఇటీవల మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువతి ప్రేమ పేరుతో యువకుడి నుంచి అందినకాడికి దోచేయాలని యత్నించింది. దీంతో ఆ యువకుడు తనువు చాలించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: TG Weather: వణికిస్తున్న చలి.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

గర్భం.. ఐదు లక్షల డిమాండ్..
కర్నూలు జిల్లా(Kurnool District) ఎమ్మిగనూరులో ల్యాబ్ లో పనిచేస్తున్న అరుణ అనే పనిమనిషితో కృపాసాగర్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది. దీంతో అరుణ గర్భం దాల్చడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. కృపాసాగర్ నుంచి 5లక్షలు లాగేసింది. అయితే మూడునెలల క్రితం మరో యువతితో కృపాసాగర్ వివాహం చేసుకున్నాడు.
ల్యాబ్ వద్ద గొడవ, ఆత్మహత్య చేసుకున్న కృపాసాగర్
అయితే అరుణ తాను మరోసారి తాను గర్భిణీ అని దానికి కృపాసాగర్ కారణం అంటూ ల్యాబ్ వద్ద గొడవకు దిగింది. అరుణ వేధింపులు తాళలేక కృపాసాగర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరుణ డబ్బు కోసం తన భర్తను బ్లాక్ మెయిల్ చేసిందని, అందుకే తన భర్త తనువు చాలించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అరుణపై కఠిన చర్యలు తీసుకోవాలని అరుణ డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: