📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

AP: కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

Author Icon By Saritha
Updated: December 29, 2025 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్

వరదయ్యపాళెం : (AP) వరదయ్యపాలెం మండలం సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల్లో సూళ్లూరుపేటలోని పూజిత అగ్రో సర్వీస్ సెంటర్లో సుమారు రూ.1500లకు కల్తీ విత్తనాలను కొని నారు పోసి నాటగా 15 రోజుల్లోనే ఎన్నులు తీయడం, ఫైకి ఎదగకపోవడం వల్ల కల్తీ విత్తనాలతో నష్టపోయిన సుమారు 250 మంది రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.62000 నష్టపరిహారం చెల్లించాలని. ఈ కల్తీ(adulteration) విత్తనాలు అమ్మిన సుళ్లూరుపేట పూజిత ఆగ్రో సర్వీస్ సెంటర్ యాజమాని శ్రీధర్ రెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కన్వీనర్ సుధాకర్ రెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్ని రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read also: AP: రైలు ప్రమాద ఘటన.. హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవే

రైతులు కల్తీ విత్తనాల కారణంగా ఆవేదన వ్యక్తం

వరదయ్యపాలెం మండలంలోని మావిళ్ళపాడు కలతూరు కొవ్వకొల్లి మరదవాడ అంగూరు సాతంబేడు తదితర గ్రామాల రైతులు సుమారు 250 మంది విత్తనాలు (AP)నారుపోసి నాటి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎక్కువ మంది రైతులు భూములను కౌలుకు తీసుకొని ఈ వ్యవసాయ సాగు చేస్తున్నారని, కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన భూమి గల యజమానులకు కవులు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని రైతులు తీవ్ర ఆవేదనకు గురి ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సుధాకర్రెడ్డి చిన్నిరాజ్ నాయకత్వాన వరదయ్యపాలెం మండలంలోని గ్రామాల పొలాలలో క్షేత్రస్థాయిలో వెళ్లి రైతులతో కలిసి పరిశీలించడం జరిగిందని ఆ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గుత్తకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న మాకు ఈ కల్తీ విత్తనాలు వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి భూములను సరియైన నిర్వహించి రైతులను గుర్తించి పరిహారం చెల్లించాలని లేకుంటే ఆత్మహత్య చేసుకోవడమే తప్ప వేరే గత్యంతరం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ధనుంజయులు శెట్టి చంద్ర, ధనంజయల్ నాయుడు, చలపతి నాయుడు, విజయ ఉప్పరపాటి, మునిరాజా, యువరాజు, తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Agriculture Loss Andhra Pradesh Farmers Association Compensation Demand Farmers Protest Spurious Seeds Telugu News Varadayyapalem

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.