సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా(AP) కోడి పందేల హడావిడి మొదలైంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట ప్రాంతం పందేల కేంద్రంగా మారింది. ఇక్కడ పెద్ద ఎత్తున పందేలు జరుగుతుండగా, లక్షల రూపాయల లావాదేవీలు సాగుతున్నట్లు సమాచారం.
Read Also: AP: ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
పోలీసులు పలు మార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, పందెం రాయుళ్లు వాటిని లెక్కచేయకుండా పందేలను(AP) కొనసాగిస్తున్నారు. బరుల ఏర్పాట్ల కోసం ముందుగానే ప్రదేశాలను పరిశీలించడం, ఎక్కడ బరులు గీయాలనే అంశంపై చర్చలు జరపడం వంటి పనులు వేగంగా సాగుతున్నాయి.
జగ్గంపేటతో పాటు గండేపల్లి, తుని రూరల్, పిఠాపురం, తొండంగి, గోకవరం, గొల్లప్రోలు, కరప, కాకినాడ రూరల్ ప్రాంతాల్లోనూ కోడి పందేల సందడి క్రమంగా పెరుగుతోంది. పండుగ సమయం దగ్గర పడుతున్న కొద్దీ పందేలు మరింత ఉధృతం అయ్యే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: