ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) రాష్ట్రంలో చేపడుతున్న వ్యాపార సంస్కరణలకు జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించింది. ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఆయన్ను(AP) “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్”గా ఎంపిక చేసింది. రాష్ట్రానికి పెట్టుబడుల్ని రప్పించడంలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు, ఆ మేరకు గూగుల్ వంటి సంస్దలు పెట్టుబడులు పెడుతున్న తీరు, ఇలా పలు అంశాలకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం ప్రకటించింది.
Read also: AP: అల్లూరి హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై లోకేశ్ ఆదేశాలు
చంద్రబాబుకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు
చంద్రబాబుకు(AP) అవార్డు లభించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.చంద్రబాబును ఒక దార్శనిక నేతగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, ఐటీ, గ్రీన్ ఎనర్జీ రంగాలను ప్రోత్సహించడం, పాలనలో సంస్కరణలు తీసుకురావడంలో ఆయన చూపిన చొరవ, కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఆయన చేపట్టిన కార్యక్రమాలు ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్య సాధనకు మార్గం సుగమం చేస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషికి మరింత శక్తి చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన సందేశంలో తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: