📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: రేపు మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం

Author Icon By Aanusha
Updated: February 8, 2026 • 9:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఒక అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, ముఖ్య శాఖల సెక్రటరీలు హాజరుకానుండగా, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ విధానంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర-2047 విజన్, పది సూత్రాలపై చర్చ జరగనుంది. ఆదాయార్జన శాఖలు, కేంద్రప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై కూడా సమీక్షించనున్నారు.

Read Also: AP: బర్డ్ ఫ్లూ తో 28 వేల కోళ్లు మృతి

AP: CM Chandrababu Naidu to meet with ministers and secretaries tomorrow

ప్రాజెక్టుల పురోగతిని సీఎం విశ్లేషించనున్నారు

ఆదాయాన్ని ఆర్జించే శాఖల పనితీరు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో సమీక్ష జరగనుంది.రియల్ టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా అవేర్, డేటా లేక్ వంటి వ్యవస్థల వినియోగం, పాలనలో కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్, ఇతర ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh CM Chandrababu naidu latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.