ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఒక అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, ముఖ్య శాఖల సెక్రటరీలు హాజరుకానుండగా, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ విధానంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర-2047 విజన్, పది సూత్రాలపై చర్చ జరగనుంది. ఆదాయార్జన శాఖలు, కేంద్రప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై కూడా సమీక్షించనున్నారు.
Read Also: AP: బర్డ్ ఫ్లూ తో 28 వేల కోళ్లు మృతి
ప్రాజెక్టుల పురోగతిని సీఎం విశ్లేషించనున్నారు
ఆదాయాన్ని ఆర్జించే శాఖల పనితీరు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో సమీక్ష జరగనుంది.రియల్ టైమ్ గవర్నెన్స్లో భాగంగా అవేర్, డేటా లేక్ వంటి వ్యవస్థల వినియోగం, పాలనలో కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్, ఇతర ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: