AP:మంత్రి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమై మూడు ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం వేదికగా ఒక ప్రత్యేక స్మారక గీతాన్ని విడుదల చేశారు. ఈ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో యువత పాత్రను మార్చివేసిందని ఆయన కొనియాడారు.
Read Also: Ambati Rambabu : అంబటి వ్యాఖ్యల పై తిరుపతి లో పిర్యాదులు
కార్యకర్తలకు భరోసా: షణ్ముఖ రెడ్డి నియామకంపై చర్చ
పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే సామాన్య కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఉంటుందని చంద్రబాబు నిరూపించారు.
- నిన్నటి వరకు సామాన్య కార్యకర్తగా ఉన్న షణ్ముఖ రెడ్డిని చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
- “ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకపోయినా పార్టీ కోసం పడ్డ కష్టాన్ని అధినాయకత్వం గుర్తించింది” అంటూ షణ్ముఖ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

కుప్పం అభివృద్ధి & హంద్రీ-నీవా ప్రాజెక్ట్
కుప్పం నియోజకవర్గంలో 150 చెరువులను కృష్ణా జలాలతో నింపినందుకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఒకే సీజన్లో హంద్రీ-నీవా ద్వారా నీటిని అందించడం ఒక రికార్డు అని, ఇది సాధ్యం కాకపోతే కుప్పం ఎడారిగా మారేదని సీఎం గుర్తు చేశారు.
చంద్రబాబు ప్రసంగంలోని కీలక అంశాలు:
- రాజకీయ ప్రస్థానం: 2028 నాటికి నా రాజకీయ జీవితం 50 ఏళ్లకు చేరుతుంది. నా అనుభవం అంతా ప్రజల సంక్షేమం కోసమే.
- కార్యకర్తల గుర్తింపు: పార్టీ జెండా మోసే వాళ్లను వెతుక్కుని వచ్చి మరీ గౌరవిస్తాను.
- టెక్నాలజీ వాడకం: ఎమ్మెల్యేల పనితీరును వారం వారం విశ్లేషిస్తున్నాను. కార్యకర్తలతో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండేందుకు టెక్నాలజీని వాడుతున్నాం.
- విజన్: భారత దేశానికి అమరావతి లాంటి కొత్త నగరాలు అవసరమని ఆర్థిక సర్వే కూడా చెబుతోంది. రాయలసీమను ఉద్యానవన హబ్గా తీర్చిదిద్దుతాం.
- స్ట్రైక్ రేట్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో 100 శాతం ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: