📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

AP: ఆదివాసీల దశాబ్దాల కలను సాకారం చేసిన చంద్రబాబు

Author Icon By Saritha
Updated: February 6, 2026 • 12:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుర్తేడు తాశీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్

గుర్తేడు(చింతూరు) : పోలవరం జిల్లా గుర్తేడు మండలాన్ని గురువారం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ దినేష్కుమార్, రంప చోడవరం యంయల్ఎ మిరియాల శిరీషాదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. (AP) గుర్తేడులో ఉన్న ప్రభుత్వ భవనంలో తాత్కలిక తాశీల్దార్ కార్యాలయం, తాత్కలిక మండల అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2025 అక్టోబర్ లోనే వై రామవరం మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. వై రామవరం మండలంలోని మొత్తం 17 పంచాయితీల్లో బుడ్డగండి, పాతకోట, కానివాడ, ధారగడ్డ, గుర్తేడు 5 పంచాతీయలలోని 59 రెవెన్యూ గ్రామాలను కలిపి గుర్తేడు మండలంగాను, మిగిలిన వె రామవరం, యార్లగడ్డ, చవిటిదిబ్బల, పి. యర్ర గొండ, పనసలపాలెం, కోట, యర్రంరెడ్డిపాలెం, చింతల పూడి, దాలిపాడు, దేవరమడుగుల, చామగడ్డ, కె. ఎర్రగొండ 12పంచాయితీల్లో 78 రెవెన్యూ గ్రామాలను పాత వై. రామవరం మండలంగా ఉంచారు.

Read Also: Chandrababu Naidu: రాయలసీమ ఎత్తిపోతలకు చంద్ర గ్రహణం!

గుర్తేడు మండలం ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే శిరీషాదేవి

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమములో (AP) రంపచోడవరం యంయల్ఎ మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ ఆదివాసిల దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కే దక్కుతుందని, రంపచోడవరాన్ని జిల్లాగా చేసిన ఘనత చంద్రబాబునాయుడుదే అని, ఈ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జీవితాంతం బుణపడి ఉండాలని ఆమె అన్నారు. ఆదివాసీలు, కొండరెడ్లపై ప్రత్యేక అభిమాన్ని ముఖ్యంత్రి చంబ్రాబునాయుడు(CM Chandrababu) మరో సారి చాటుకున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ఇప్పటికే రంపచోడవరం జిల్లాలోని 12 మండలాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చట్టామని, అనేక మారు మూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించ టానికి నిధులు మంజూరు అయ్యాయని, ప్రభుత్వం ఇచ్చిన ఈ బృహత్తర అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.

అదే వేదికపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చాపరాయి మటన ఈ ప్రాంత చరిత్రను మార్చిందని, ఎటువంటి కమ్యూనికేషన్ లేని మారుమూల గ్రామాలకు నేడు మోబైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, అనేక గ్రామాలకు రహదారుల నిర్మాణం జరుగు తుందని, త్వరలోనే మండలానికి అవసరమైన అన్ని భవనాలను నిర్మాణం చేపట్టి పూర్తి స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కార్యక్రమ ములో రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, ఇన్చార్జ్ చేసి స్మరణ్రాజ్, రంప చోడవరం సబ్కలెక్టర్, చింతూరు ఇన్చార్జ్ పివో శుభం నోక్వాల్, రాష్ట్ర యస్.టి. కమిషన్ సభ్యులు గొర్లె సునిత ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Ap Chinturu Gurtedu Gurtedu Mandal Latest News in Telugu Mandal Formation New Mandal polavaram district Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.