📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: AP: ఈఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భేష్!

Author Icon By Saritha
Updated: November 13, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈఈటీ ఏర్పాటును ప్రశంసించిన బీఈఈ

విజయవాడ : విశాఖపట్నంలో(AP) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (కో ఈఈటీ)ను ఏర్పాటు చేసినందుకు రాష్ట్రాన్ని బ్యూరో ఎనర్జీ ఆఫ్ ఎఫిషియన్సీ (బీఈఈ) ప్రశంసించింది. ఇది ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ఒక మైలురాయిగా నిలిచింది. దేశంలో 2070 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యంలో ఒక ప్రధాన ప్రోత్సాహకంగా బీఈఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎనర్జీ ఎఫిషియెన్సీ (ఈఈ) టెక్నాలజీల అమలును వేగవంతం చేయాలని కోరింది. ఇది దేశ వాతావరణ మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించ డంలో కీలకంగా మారనుంది. అదే సమయం లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టి స్తుంది. ఈ కార్యక్రమాలను అమలు చేయడం లో మిషన్మోడ్ విధానాన్ని అవలంబించాలని బీఈఈ అన్ని రాష్ట్రాల ఎన్డీఏలను కోరింది. ఈక్రమంలోనే అనేక రాష్ట్రాల చురుకైన విధానాలను బీఈఈ అభినందిస్తూ, విశాఖ పట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (కో ఈఈటీ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. పునరుత్పాదక ఇంధన స్వీక రణ, క్లీన్ టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రోత్స హించడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా బీఈఈ అభివర్ణించింది. పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. బీఈఈ, ఈఈఎస్ఎల్, విద్యుత్ మంత్రిత్వ శాఖ సాంకేతిక మరియు ఆర్థిక సహాయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ప్రమాణాలతో కూడిన 24/7 విద్యుత్ సరఫరాను అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. తద్వారా రాష్ట్రంలో గణనీయమైన పెట్టుబడు లను ఆకర్షించాలని నిశ్చయించు కుందని స్పష్టంచేశారు.

Read also: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు

AP: ఈఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భేష్!

గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం

సుస్థిర, కాలుష్య రహిత భవిష్యత్తుకు రాష్ట్రం(AP) అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అందులో భాగంగా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (నెడ్కాప్) ద్వారా విశాఖపట్నం సమీపంలో అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఏర్పాటు చేయడానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎనీఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకుందని విజయానంద్ వెల్లడించారు. సుమారు రూ.1.85 లక్షల కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (కో ఈఈటీ) ఏర్పాటు అనేది దేశ జాతీయ ఇంధన సామర్థం మరియు స్వచ్చ ఇంధన పరివర్తన లక్ష్యాలకు సంపూర్ణంగా అనుగుణంగా ఉండే ప్రశంసనీయమైన చొరవ అని బీఈఈ కార్యదర్శి మిలింద్ డియోర్ ప్రశంసించారు. అన్ని రాష్ట్రాల ఎన్డీఏలతో సమన్వయంతో ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడానికి బీఈఈ సమగ్ర రోడ్మ్యప్ను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఇది వాతావరణ మార్పు లను పరిష్కరించడంలో కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఇంధన సామర్థ్య పద్ధతులలో వెయ్యి మందికి పైగా నిపుణులు మరియు యుటిలిటీ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చినందుకు ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh APEDCL BEE Centre of Excellence COEET Energy Transition green hydrogen hub Latest News in Telugu Renewable Energy Telugu News visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.