📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Cabinet : కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం

Author Icon By Divya Vani M
Updated: March 17, 2025 • 9:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Cabinet : కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఛాంబర్‌కు వెళ్లి ప్రత్యేకంగా చంద్రబాబుతో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనా వ్యవహారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.కేబినెట్ సమావేశంలో టీచర్ల బదిలీల నియంత్రణ కోసం చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. అలాగే, రాజధానిలో భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం సమ్మతి తెలిపింది.

AP Cabinet కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం

చేనేత కార్మికుల సంక్షేమం కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయాలని, మర మగ్గాల కోసం 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించాలని నిర్ణయించారు.నంబూరులోని వీవీఐటీయూ విద్యాసంస్థకు ప్రైవేట్ యూనివర్శిటీ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.అంతేకాకుండా అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు పచ్చజెండా ఊపింది. కొన్ని సంస్థలకు భూకేటాయింపులపై కూడా ఈ సమావేశంలో అనుమతులు మంజూరు చేశారు.ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది.

నివేదిక ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ చేయాలని కమిషన్ సూచించగా, కొందరు ఎమ్మెల్యేలు జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలన్న ప్రతిపాదన చేశారు.దీంతో 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ చేయాలని నిర్ణయించగా, 2026 జనాభా లెక్కల తర్వాత జిల్లాను యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ చేపట్టాలని తేల్చారు. దీనికి అనుగుణంగా, అసెంబ్లీలో తీర్మానం చేసి జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపాలని నిర్ణయించారు.అంతేకాకుండా, బుడగజంగాలు సహా మరో కులాన్ని ఎస్టీల్లో చేర్చేందుకు కేబినెట్ తీర్మానం చేసింది. వైఎస్సార్ జిల్లాను ఇకపై ‘వైఎస్సార్ కడప జిల్లా’గా పిలవాలని నిర్ణయం తీసుకుంది. పెనమలూరులోని తాడిగడప మున్సిపాలిటీకి ‘వైఎస్సార్’ పేరు తొలగించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చలు మొదలయ్యాయి.

AndhraPradeshNews APCabinetMeeting ChandrababuNaidu PawanKalyan PoliticalUpdates TDP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.