AP Assembly Seats: ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక సంకేతాలు వచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై కేంద్రం ఇటీవల సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also:Srisailam fire accident : శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
ఈ పునర్విభజన ప్రక్రియకు సంబంధించి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మార్పులు అమలైతే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు సుమారు 50 వరకు పెరగడంతో పాటు, లోక్సభ సీట్లు కూడా మరో 7 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చకు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు అమలుకాలేదు. తాజా పరిణామాలతో ఈ అంశం మళ్లీ రాజకీయంగా హాట్టాపిక్గా మారింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: