📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

AP: సమాచార హక్కు కమిషనర్ల నియామకం.. సిఐసిగా లాయర్ వజ్జా శ్రీనివాస రావు

Author Icon By Rajitha
Updated: January 19, 2026 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషన్ కు ప్రభుత్వం కొత్త సారథులను నియమించింది. ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) ప్రముఖ న్యాయవాది వజ్జా శ్రీనివాసరావును ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురిని సమాచార కమిషనర్లుగా నియమించారు. వీరిలో వి.శరత్ చంద్ర కల్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న (అనంతపురం), ఒంటేరు రవిబాబు (కడప), పరవాడ సింహాచలం నాయుడు (విశాఖపట్నం) ఉన్నా. నియమితులైన వారంతా న్యాయవాద వృత్తికి చెందినవారు కావడం గమనార్హం.

Read also: BookLaunch: ఒత్తిడి నిండిన జీవితానికి ‘హాస్యం’ దివ్యౌషధం

Lawyer Vajja Srinivasa Rao appointed as CIC

ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని

ఈ కొత్త కమిషనర్లు మూడేళ్ల పాటు లేదా వారికి 65 ఏళ్లు వచ్చే వరకు (ఏది ముందైతే అది) పదవిలో కొనసాగుతారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన, మంత్రులతో కూడిన సెలెక్షన్ కమిటీ చేసిన సిఫార్సులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఈ నియామకాలను ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం కమిషన్లో ముగ్గురు సభ్యులు ఉండగా, తాజా నియామకంతో కమిషన్ బలం గణనీయంగా పెరిగింది. ఈ నియామకాలతో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుల పరిష్కారం వేగవంతం అవుతుందని, ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP government news latest news RTI Commission AP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.