రాష్ట్రంలో(AP) కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. సంవత్సరాలుగా పరీక్షలు, శారీరక సామర్థ్య పరీక్షలు, మెడికల్ టెస్టులు పూర్తి చేసి నియామక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది నిజంగా శుభవార్త. ఈ నెల 16వ తేదీన నియామక పత్రాలను అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) లాంఛనంగా ప్రారంభించనున్నారు..
Read also: ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు

నియామక పత్రాల పంపిణీ కోసం ఏర్పాట్లను పరిశీలించారు
ఈ విషయాన్ని(AP)రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. డీఐజీ ఏసుబాబు, గుంటూరు జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబుతో కలిసి ఆమె ఏర్పాట్లను పర్యవేక్షించి, పలు సూచనలు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :