విశాఖపట్నంలో ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల కోసం అత్యంత అనుకూల రాష్ట్రంగా అభివర్ణించారు. పెట్టుబడిదారులు ఏపీపై నమ్మకం ఉంచి ముందుకు రావడానికి మూడు కీలక అంశాలు కారణమని ఆయన వివరించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు. లోకేశ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న ఈ సమయంలో పెట్టుబడులకు సరైన వాతావరణం కల్పించడం చాలా ముఖ్యం అని చెప్పారు. ఏపీ అందుకు సిద్ధంగా ఉందని, పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని తెలిపారు.
Read also: Kurnool: కర్నూలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు
AP: పెట్టుబడులకు ఏపీనే స్వర్గధామం
అనుభవజ్ఞుడైన నాయకత్వాన్ని
మొదటి కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన నాయకత్వాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధికి దార్శనికతతో పనిచేసే నాయకత్వం ఎంతో అవసరమని, ఆ అవకాశం ఏపీకి లభించడం పెట్టుబడిదారులకు ఒక పెద్ద బలమన్నారు. రెండవ కారణంగా వేగవంతమైన అమలు వ్యవస్థను లోకేశ్ వివరించారు. భూ కేటాయింపు నుంచి అనుమతుల వరకు ఏ పనైనా త్వరగా పూర్తి చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని, “మీరు చేసే పనికంటే మేమే వేగంగా స్పందిస్తాం” అని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
మూడవ కారణంగా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయాన్ని ‘డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’గా అభివర్ణించారు. రెండు ప్రభుత్వాలు ఒకే దిశగా పనిచేస్తూ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు రూపొందిస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: