సచివాలయం : వెలగపూడి సచివాలయంలో(AP) కారు ప్రమాదం ఉద్యోగులు, సందర్శ కులను ఉలికిపాటుకు గురిచేసింది. సచివాలయం అవుట్ గేటు నుంచి వేగంగా లోనికి దూసుకు వచ్చిన ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. సచివాలయం గేటు లోపలికి రాగానే శబ్దంతోపాటు ముందు చక్రం ఒక్కసారిగా పేలింది. దీంతో భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అదుపు తప్పిన కారు.. వేగంగా ముందుకు కదలి సమీపంలోని కియా ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషనన్ను బలంగా ఢీ కొట్టింది. దీంతో చార్జింగ్ స్టేషన్ గోడ ధ్వంసమైంది. ఆ సమయంలో కియా ఎలక్ట్రిక్ చార్జీంగ్ స్టేషన్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సిఆర్డీఏలో(CRDA) డైరెక్టర్గా ఉన్న ఆర్.గోపాలరెడ్డికి చెందని కారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆయన కారులోనే ఉన్నారు. అద్దె డ్రైవర్ యార్లగడ్డ కళ్యాణ్ చక్రవర్తి కారును నడుపుతున్నట్లు గుర్తించారు. మార్గంలో సెక్యూరిటీ సిబ్బంది, సందర్శకులు ఎవరూ లేకపోవడం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని భద్రతా సిబ్బంది విచారిస్తున్నారు.
Read Also: Guntakal: 0–5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన వైద్య ఆరోగ్య శాఖ
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: