(AP) ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక వచ్చిన తర్వాత వీరిద్దరూ నోరు మెదపడం లేదని అన్నారు. ఇంతవరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎంతో పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మిన దుర్మార్గులు చంద్రబాబు, పవన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరించారని అన్నారు.

Read Also: Deputy CM Pawan: కాలుష్యానికి కళ్లెం వేద్దాం
(AP) పవన్ చంద్రబాబుకు చెంచాగా మారిపోయారని అంబటి ఎద్దేవా చేశారు. సొంత పార్టీ ఉందన్న విషయమే మరిచిపోయారని విమర్శించారు. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందంటూ పవన్ తప్పుడు ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు.
నెయ్యి శాంపిల్స్ కోసం ట్యాంకర్లు కూటమి ప్రభుత్వం హయాంలో వచ్చినట్లు అంబటి తెలిపారు. నివేదికల ప్రకారం శాంపిల్స్లో జంతువుల కొవ్వు కలవలేదని నివేదికల్లో ఉన్నా కానీ వైసీపీపై బురద చల్లేందుకు ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు. బోలేబాబా వ్యవహారమూ చంద్రబాబు హయాంలోనే చోటుచేసుకున్నదని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: