AP: లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ విషం చిమ్మారన్న అంబటి

Read Time:  1 min
AP: లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ విషం చిమ్మారన్న అంబటి
FONT SIZE
GET APP

(AP) ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక వచ్చిన తర్వాత వీరిద్దరూ నోరు మెదపడం లేదని అన్నారు. ఇంతవరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎంతో పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మిన దుర్మార్గులు చంద్రబాబు, పవన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరించారని అన్నారు. 

AP: లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ విషం చిమ్మారన్న అంబటి

Read Also: Deputy CM Pawan: కాలుష్యానికి కళ్లెం వేద్దాం

(AP) పవన్ చంద్రబాబుకు చెంచాగా మారిపోయారని అంబటి ఎద్దేవా చేశారు. సొంత పార్టీ ఉందన్న విషయమే మరిచిపోయారని విమర్శించారు. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందంటూ పవన్ తప్పుడు ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు.

నెయ్యి శాంపిల్స్ కోసం ట్యాంకర్లు కూటమి ప్రభుత్వం హయాంలో వచ్చినట్లు అంబటి తెలిపారు. నివేదికల ప్రకారం శాంపిల్స్‌లో జంతువుల కొవ్వు కలవలేదని నివేదికల్లో ఉన్నా కానీ వైసీపీపై బురద చల్లేందుకు ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు. బోలేబాబా వ్యవహారమూ చంద్రబాబు హయాంలోనే చోటుచేసుకున్నదని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.