ఆంధ్రప్రదేశ్(AP Accident)లోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. శ్రీశైలం నుండి విజయవాడ(Vijayawada) వైపు ప్రయాణిస్తున్న బస్సు మద్దలకట్ట–సానికవరం జాతీయ రహదారిపై నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఘటన సమయంలో వాహనంలో సుమారు నలభై మంది ఉన్నారు.
Read Also: CyberCrime: శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్సైట్ మోసం

ఇందులో ముప్పై మంది గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి బాధితులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కారణాలను పరిశీలిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: